AP Govt: విద్యార్థులకు కీలక అప్డేట్ – ఆల్బెండజోల్ మాత్రలు

ఫిబ్రవరి 17, 26వ తేదీన జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేయనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నులిపురుగులను నివారించేందుకు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రాలను అందజేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారందరికీ అంగన్వాడి, స్కూలు, కాలేజీల్లో ఈ ఆల్బెండిజోల్ మాత్రలను అందజేయనున్నట్లు ఏపీ కుటుంబం, ఆరోగ్యం సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ తెలపడం జరిగింది.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

చిన్నపిల్లలలు మట్టిలో ఆడుకున్నప్పుడు ఈ నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తర్వాత శరీరంలో పరాన్న జీవులుగా మారి పిల్లల ఆహారాన్ని ఇవి తింటాయి. ఇందు చేత పిల్లలకు ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం తదితర సమస్యలు ఏర్పడతాయి.

ఈ విషయాన్ని అందరూ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తమ పిల్లలకి ఆల్బెండజోల్ మాత్రలు అందాయో లేదో చూసుకోవాలి. ఈ విషయాన్ని మీ తోటి తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment