దివ్యాంగులకు శుభవార్త! AP divyang shakti Scheme 2026

AP divyang shakti Scheme 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు భారీ శుభవార్త. దివ్యాంగులు ఇక నుండి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం నూతనంగా దివ్యాంగుల కోసం “దివ్యాంగ శక్తి ” పథకాన్ని తీసుకొచ్చింది. ఈ AP divyang shakti Scheme 2026 సంబంధించి పూర్తి వివరాల చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2025వ తేదీ నుండి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది.

10060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్

వికలాంగుల కు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దివ్యాంగ శక్తి పథకాన్ని మార్చి 18, 2026వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 40% డిజేబులిటీ కలిగిన దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

ఇది వరకు 50 శాతం రాయితీతో దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఇకనుండి డబ్బులు చెల్లించకుండా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17, 2026వ తేదీ నుండి అర్హత కలిగిన వారికి బస్సు పాస్లను అందజేస్తుంది.

ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment